Header Banner

జగనన్న కాలనీల అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం! విచారణ అనంతరం కఠిన చర్యల హామీ!

  Thu Mar 13, 2025 14:47        Politics

జగనన్న కాలనీల్లో అవినీతి, అక్రమాలపై మండలిలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదులు అందగా, భూసేకరణ, పనులలో భారీ అవినీతి జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. గత ప్రభుత్వం భూసేకరణకు రూ.11,341 కోట్లు ఖర్చు చేసినప్పటికీ, నివాసయోగ్యం కాని భూములను కొనుగోలు చేసి పేదలపై అన్యాయం చేసిందని ఆరోపించారు. కొన్ని చోట్ల శ్మశాన స్థలాలను ఇళ్ల స్థలాలుగా కేటాయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఇది కూడా చదవండి: వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

రాష్ట్రవ్యాప్తంగా అవినీతి, అక్రమాలపై విచారణ కొనసాగుతుందని, నివేదిక రాగానే బాధ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే నిధులను గత ప్రభుత్వం భారీగా తగ్గించిందని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణం పేరిట కాంట్రాక్టర్లు విధులు కాజేశారని, విచారణ జరిపి రికవరీ చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇకపై పేదల ఇళ్ల నిర్మాణ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #JaganannaScam #latestnews #breakingnews